లేబుళ్లు

15, జులై 2010, గురువారం

India today ki oka lekha.

'ఆంధ్రజ్యోతి ' లో లేఖల శేర్షిక కో లేఖ.


ది. 1-9-2013  'ఆంధ్రజ్యోతి' కొత్తపలుకు'  శీర్షికలో  'రూపాయేకాదు సర్వం పతనం'  ఆర్.కె  గారి  వ్యాసం చదివాక  ప్రస్తుత భారతదేశ పయనమెటు అన్న ప్రశ్న ప్రతి సగటు భారతీయుని మదిలో రాక తప్పదు. ఆర్దికరంగంలోనే కాదు
 అంతం లేని సవాళ్లు ప్రభుత్వాలముందు ఎన్నో ఎన్నెన్నో వున్నాయి.

ప్రజల కడగండ్లు తీర్చే వారెవరు లేరన్నది సత్యం.

మహాకవి శ్రీ,శ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రజలు కచ్చితంగా తలచడం లేదు

ఎలాగు ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని అంతలా పట్టించుకోవడం లేదు.

కాలం సమస్యల్ని తీరుస్తాయని వారి ఉద్దేశ్యం లా వుంది.

అందుకే తనబిడ్డ్లలను కాపాడమని ఆ భగవంతుని  ప్రార్ధించడం తప్ప ఏమి చేయ లేని సగటు భారతీయులం.

 'భారతావని' లెక్కకు మిక్కిలి బాధలతో సతమతమవుతోంది. ఒక పక్కన పాకిస్తాన్ ఇంకో పక్క చైనా మన దేశాన్ని అస్థిరం చేయడానికి కలిసి కుట్రలు పన్నుతూ  చేయగలిగిందంతా చేస్తున్నారు. చివరకి మాలి, మైనమార్ లాటి దేశాలు కూడా ఈ మహోన్నత దేశాన్ని ఖాతరు చేయడం లేదు.

చేతగాకో, చేవలేకో కేంద్రప్రభుత్వం చేష్టలుడిగి దిక్కులు చూస్తూ కాలం గడుపుతున్నది.

దేశంలో ప్రతి రాష్ట్రం ఏదో ఒక విష సమస్యతో సతమత మవుతూనే వున్నాయి.

అసలు కేంద్ర ప్రభుత్వం ఒకటున్న దన్న దన్ను ఏ పౌరుడుకి లేదు. ఒక సామాన్య పౌరుడు అనుకుంటున్నట్లుగానే గౌరవనీయులు ఈ దేశ ప్రధాని గారే మొన్నీ మధ్య పార్లమెంటులో మాట్లాడుతూ తన వైఫల్యాలని ఇతరులమీద రుద్దడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.  ఉదాహరణకు
మొన్నబీహార్లో జరిగిన రైలు ప్రమాదం గురించి ఎందుకు జరిగిందో రైల్వే మినిస్టర్ గారు  సెలవిచ్చారు.

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ముందుచూపు లేని నిర్ణయం తో సీమాంధ్ర  మొత్తం అట్టుడుకుతోంది

ఇంకో పక్క తెలంగాణా సమస్య వల్ల అభివృద్దే ఆగిపోయింది.

ఇక కర్నాటక సంగతికొస్తే గనులు, జనార్దనం, ధనార్జనం తప్పవేరే వార్తలేమి వున్నాయి.

ఇక ప్రతి రాష్ట్రం గురించి వ్రాయాలంటే అంతం వుండదు.

కాని అంతం లేని సవాళ్లు ప్రభుత్వాలముందు ఎన్నో ఎన్నెన్నో వున్నాయి.

ప్రజల కడగండ్లు తీర్చే వారెవరు లేరన్నది సత్యం.

మహాకవి శ్రీ,శ్రీ అన్నట్లు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ప్రజలు ఖచ్చితంగా తలచడం లేదు

ఎలాగు ప్రభుత్వాలు ప్రజల సమస్యల్ని అంతలా పట్టించుకోవడం లేదు.

కాలం సమస్యల్ని తీరుస్తాయని వారి ఉద్దేశ్యం లా వుంది.

అందుకే మనలని మనం క్షమించుకోలేని రోజు రాకూడదని ఆ భారతమాతని ప్రార్ధించడం తప్ప ఏమి చేయ లేని సగటు భారతీయులం.

కేశిరాజు వెంకట వరదయ్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి