లేబుళ్లు

15, జూన్ 2011, బుధవారం

నేటిభారతం ...... కవిత


                     నేటిభారతం


ఆపాదమస్తకం అలజడితో సతమతం  
ఆటుపోట్లతో అంధకారం అలుముకొంటోంది
సమస్యల జడివానలో తల్లి భారతి
తడిసి ముద్దయిపోతోంది 
చలికాచే  వారు లేరు..సరికదా!
చనుబాలు త్రాగిన వారే
పరాయి పంచన చేరి
పంపకాలు చేస్తున్నారు!
దేశాన్ని ఏలే వారు
దిశా నిర్దేశం  చేయడం లేదు
పగ్గాలు వదేలేశారు 
ప్రాపకులు ఎక్కువయ్యారు 
ఎంచుకోవడం, పంచుకోవడం 
నిత్య కృత్యమైంది 
'ప్రజ'నడిగేవారు లేరు
మెరమెచ్చు మాటలు
మాయ సంకేతాలు 
సడి ఎరిగి సంతలో
కొంటారు మాటను!
బేరాలలో నుంచి
మదిరమ్ములోముంచి
సవ్వడే లేకుండా 
ఏలికలవుతున్నారు !  
పాలకులవుతున్నారు !


 రచన
కేశిరాజు వెంకట వరదయ్య  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి